బొడ్డు మన శరీరానికే కాదు ఆరోగ్యానికి కేంద్ర బిందువు. కడుపులో ఉన్న పిల్లలకు బొడ్డు ఆహారాన్ని అందించే పైపులా ఉపయోగపడే బొడ్డు శరీరంలో ప్రతి భాగంలో అనుసంధానం అయి ఉంటుంది. అందుకే బొడ్డుచికిత్స ద్వారా ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. దానికోసం ఏం చెయ్యాలో తెలుసుకోండి.
ఈచికిత్స కోసం దేశీ నెయ్యి, కొబ్బరినూనె, పచ్చి ఆవనూనె అన్నీ ఆర్గానిక్ పదార్థాలు తీసుకుని సమపాళ్ళలో తీసుకుని రెండు చుక్కలు బొడ్డులో వేసి నాలుగువైపులా మసాజ్ చేయాలి. ఇలా చేయడంవలన అనేక అనారోగ్యసమస్యలు తొలగిపోతాయి.
ఎందుకంటే బయటకు వెళ్తే కలుషితమయిన గాలి, దుర్గంధం, కల్తీ ఆహారం, స్వచ్ఛతలేని నీళ్ళు వలన ఆరోగ్యం పాడయిపోతుంది. అందుకే శరీరంలోని నరాలను ఉత్తేజితం చేయడానికి బొడ్డులో నూనె వేసి మసాజ్ చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. శరీరంలో ఏ అనారోగ్యం కలిగినా బొడ్డచికిత్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. బొడ్డుకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే నాభిధ్యానానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే నాభిలో నూనెలు వేసి మసాజ్ చేయడంవలన తెల్లగా మారిన జుట్టు కూడా నల్లగా మారుతుంది.
పొట్టకి సంబంధించిన గ్యాస్, మలబద్దకం, అధిక కొవ్వు, బరువు, పొట్టపెద్దగా ఉండడం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా చేయడం మూలంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం, స్త్రీలలో సంతాన సమస్యలు తగ్గుతాయి. నాభీ మసాజ్ వలన శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. నాభీ మసాజ్ వలన జలుబు, దగ్గు తగ్గుతుంది. మహిళల్లో కొబ్బరినూనె లేదా ఈ మూడు నూనెల మిశ్రమం నెలసరి సమస్యలు తగ్గిస్తుంది. కొద్దిగా వేడిచేసి మసాజ్ చేయడంవలన శరీరంలోని కీళ్ళు, నడుము నొప్పులు తగ్గిపోతాయి.