మారుతున్న జీవన విధానం వల్ల ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల నుండి బయట పడాలంటే ప్రస్తుతం ఉన్న జీవన విధానాన్ని కూడా మార్చుకోవాలి. సరైన ఆహారం వ్యాయామం తప్పనిసరి. వీటితో పాటు అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ఇంగ్లీష్ మందులు కాకుండా అప్పుడప్పుడు ఇంటి చిట్కాలను కూడా ఉపయోగించడం మంచిది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్కా శరీరంలో అధిక బరువును తగ్గించి, జీర్ణ సమస్యలను, డయాబెటిస్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.
ఈ చిట్కా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం కావలసినవి అవిస గింజలు, వాము, జీలకర్ర. ఈ మూడింటిని సమాన మోతాదులో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవిసె గింజలను ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అవిసె గింజల్లో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అవిసె గింజలు శరీర బరువును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.
వాము జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వాములో డైటరీ ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. వాము వాత, కఫ, పిత్త దోషాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. జీర్ణ క్రియను మెరుగుపరచడం వలన శరీరంలో కొవ్వు పేరుకునే అవకాశం ఉండదు. వాములో ఫైబర్ శాతం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. జీలకర్రలో ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి.
విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6 పుష్కలంగా లభిస్తాయి. సోడియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. జీలకర్ర మలబద్దకం సమస్య తగ్గించడంలో, షుగర్ కంట్రోల్ లో ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పొడిని తయారు చేసుకుని బయట ఐతే 15 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జిలో ఐతే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పొడిని ప్రతిరోజు అరచెంచా చొప్పున తీసుకుంటే శరీరంలో అధిక బరువు, కొవ్వు జీర్ణసంబంధిత సమస్యలు, డయాబెటిస్ వంటివి తగ్గుతాయి.
ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో లేదా మధ్యాహ్నం భోజనం లో ముద్ద ముద్దలో కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇది మోతాదుకు మించి తీసుకోకూడదు. ఈ మూడింటిలో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి రోజుకి అర చెంచా మాత్రమే తీసుకోవాలి.