ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక స్పూన్ ఆముదం నీటిలో కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

ఈమధ్య కాలంలో జాయింట్ పెయిన్స్,  ఎముకల బలహీనత, నడుం నొప్పి మరియు మీ వెన్నులో, కీళ్ళలో నొప్పి వస్తుంటే  అసలైన కారణం మీ శరీరంలో వాత దోషం అనగా వాయువు అంటే గ్యాస్ బాగా పెరిగిపోయిందని అర్థం. నరాలు బలహీనపడడం వలన మలబద్ధకం, గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఈ అనారోగ్యాల నుంచి త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తుంది.

ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గ్యాస్ సమస్యలు ఎక్కువవుతాయి. గ్యాస్ అనేక అవయవాలలో చేరి అక్కడ తిష్ట వేస్తుంది. ఈ గ్యాస్ఎముకల మధ్య చేరిపోతే అక్కడ ఉండే లూబ్రికెంట్  అనే ద్రవపదార్థాన్ని వదులు చేసి కీళ్ళు అరిగిపోయేలా చేస్తుంది. దీనివల్ల మనం నడిచినప్పుడు, పరుగెత్తినపుడు, పైకి లేచినప్పుడు ఎముకల నుండి కణ్ కణ్మనే శబ్దాలు వస్తాయి.

అంతేకాకుండా దీనివలన  కీళ్ల నొప్పులు, వాపులు రావడం జరుగుతుంది. అందుకే దీనిని వాతదోషం అని పిలుస్తారు. అంతేకాకుండా దీనివలన ఆర్థరైటిస్, శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగిపోవడం, చర్మం పొడిబారినట్టు ఉండడం, అనేక ప్రదేశాల్లో నొప్పులు మరియు అలసట, నీరసం , కడుపు ఉబ్బరం, పక్షవాతం లాంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటన్నిటికీ కారణం వాత దోషమే. చర్మం పొడిబారే సమస్య ఉంటే ఎముకల మధ్యన లూబ్రికెంట్ అరిగిపోవడం, నొప్పి, శబ్దం రావడం తగ్గడానికి కూడా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ముడి ఆముదం వేసి అందులో నిమ్మరసం పిండి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఈ నీళ్ళు తాగిన అరగంట లేదా  గంట వరకు ఏమి తినకూడదు. అలా చేస్తే ఈ డ్రింక్ శరీరంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే వారానికి రెండు సార్లు మాత్రమే ఈ డ్రింక్ ప్రయత్నించాలి.

అలాగే ఒకరోజు తీసుకుని మధ్యలో రెండు రోజులు సమయం ఇచ్చి తర్వాత రోజు మాత్రమే తాగాలి. ఈ డ్రింక్ ఎవరు తీసుకోకూడదు అంటే రక్తపోటు  సమస్యలు ఉన్న వారు, గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు, గర్భవతులు, చిన్నపిల్లలకు పాలిచ్చే తల్లులు తీసుకోకూడదు. వారానికి రెండురోజులు తప్పకుండా ఈ నీటిని తీసుకుంటే ఇది ఎముకల మధ్య లూబ్రికెంట్ను పెంచుతుంది.అంతేకాకుండా గ్యాస్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

అలాగే ఎముకల నొప్పులు తగ్గించే మరో చిట్కా తెలుసుకుందాం. ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలి. ఈ చిట్కా జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం, గ్యాస్ ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.  కఫాన్ని తగ్గించి వాత దోషాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. నీటిని గిన్నిలో వేసి స్టవ్ మీద పెట్టి కొంచెం మరిగిన తరువాత ఒక స్పూన్ వాము వేయండి. అలాగే ఒక బిర్యాని ఆకు  లేదా బే లీఫ్ కూడా వేయాలి కొంత సేపు మరిగేంత వరకు ఉంచాలి.

ఇది మన జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి గ్యాస్, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ డ్రింక్లో ఫైబర్ పుష్కలంగా ఉండి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. గ్యాస్ పేరుకుపోకుండా చూస్తుంది.

ఈ మరిగిన నీటిని వడకట్టి కొంచెం ఆర్గానిక్ బెల్లం  లేదా పాత బెల్లం పొడి కలుపుకొని  ఉదయాన్నే తాగడం వలన గ్యాస్ ను కడుపు నుండి బయటకు పంపించేస్తుంది. సహజమైన చిట్కాలతో మీ కడుపును శుభ్రం చేసుకొని అనారోగ్యాలకు దూరంగా ఉండడానికి ఈ డ్రింక్ ళవారంలో ఒకసారైనా తాగడం అలవాటు చేసుకోండి..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top