షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా, షుగర్ వ్యాధికి మందుల డోస్ పెరగకుండా ఉండాలన్నా, రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గలన్నా,షుగర్ వ్యాధి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలన్నా శత్రువు లాంటి పిండి పదార్ధాన్ని షుగర్ ఉన్న వారు దూరంగా ఉంచాలి. మిత్రుడు లాంటి ఆహారం అంటే కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకోవడం వలన త్వరగా జీర్ణమై రక్తంలో కలిసిపోయి షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి.
పిండి పదార్థాలు అంటే ధాన్యం తో తయారయ్యే రవ్వ, పిండి వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు పప్పులు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి మాంసకృత్తులు, కొవ్వులు, ప్రోటీన్స్ అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల అవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది దీని వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ ఉన్న వారు కొబ్బరి తురుము, వేరుశెనగలు, నానబెట్టిన శనగలు, స్ప్రౌట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ డైట్ ఫాలో అయినట్లయితే షుగర్ వెంటనే కంట్రోల్ లోకి వస్తుంది. పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, బాదం, వాల్ నట్స్ రెండు మూడు రకాలు 15 గ్రాముల చొప్పున రోజు తింటూ ఉండాలి. దీనివల్ల నీరసం రాకుండా షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. మధ్యాహ్నం భోజనం లో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఒక పుల్కా మాత్రమే తీసుకోవాలి.
అరకేజీ లేదా ముప్పావుకేజీ కూర తినాలి. పుల్కా లేదా జొన్న రొట్టె లేదా రాగి రొట్టె ఏదైనా ఒకటి మాత్రమే తీసుకోవాలి. అన్నం పూర్తిగా మానేయాలి. ఇలా చేసినట్లయితే మందులు కూడా అవసరం లేకుండా షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. డయాబెటిస్ లేకుండా చేసుకోవాలి అనుకుంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఈ డైట్ ఫాలో అవుతూ మందుల డోస్ డాక్టర్ల సలహా మేరకు తగ్గించుకుంటూ వెళ్ళాలి. నాలుగు నుంచి ఐదు వారాలకు ఒకసారి చెక్ చేయించుకొని డోస్ తగ్గించుకోవాలి. షుగర్ కంట్రోల్ లో ఉండాలి అన్నా ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఉండాలి.